Friday, May 3, 2024
Friday, May 3, 2024

వైసీపీ ప్రభుత్వంలో నే అభివృద్ధి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే టీ జె ఆర్ సుధాకర్ బాబు తెలిపారు. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో 3వ రోజు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అభిమానులు ఘన స్వాగతం పలికారు . గ్రామంలోని సిమెంట్ రోడ్లు వేయించాలని , సైడు కాల్వలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే టీ.జె ఆర్ సుధాకర్ బాబుకు ఎస్సీ కాలనీ ప్రాంత ప్రజలు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు సంబంధిత అధికారులకు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా తీసుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తాకిన ప్రతి గడప గడపలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పొందిన మహిళల కళ్ళల్లో ఆనందం కనిపించిందన్నారు . అలాగే గ్రామలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారుబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎనిగంటి పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ,గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ, గ్రామ అధ్యక్షులు మాదాసు రాంబాబు, ఎంపీటీసీ మున్నంగి వెంకట్రావు, సొసైటీ అధ్యక్షుడు ఉప్పుగుండూరు శ్రీనివాస ప్రసాద్, కొంజేటి సురేష్ బాబు, పరంధామ రెడ్డి, ఇనగంటి రమణారెడి, ఎంపీటీసీ తాటి అనురాధ, డైరెక్టర్లు చెన్నకేశవులు, విజయ కుమార్, మద్దిసాని రాజేష్, నల్లూరి రాజా, కందుల దానియేలు, త్రినాథ్ రెడ్డి, ప్రవీణ్, పొద శ్రీధర్, ప్రసన్నకుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img