Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మృతుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

విశాలాంధ్ర – బల్లికురవ : మండల పరిధిలోని ఎస్ ఎల్ గుడిపాడు గ్రామానికి చెందిన రావులపల్లి.వెంకటేశ్వర్లు మంగళవారం పొలములో గొర్రెల మేపుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.విషయం తెలుసుకున్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి.రవికుమార్ బుధవారం ఆయన భౌతిక దేహాని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి,మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడవద్దని అన్ని విధాల అండగా ఉంటానన్నారు.గొర్రెలు మేపు కునేందుకు పొలం వెళ్లిన వెంకటేశ్వర్లు విగతజీవిగా మారి ఇంటికి వచ్చాడని మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వెంకటేశ్వర్లు కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచి రావులపల్లి.రామకృష్ణ,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కే.ఇజ్రాయిల్,రావులపల్లి గోవిందు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img