Friday, April 26, 2024
Friday, April 26, 2024

గొల్లపూడి ని పరామర్శించిన రావుల వెంకయ్య

విశాలాంధ్ర – జె పంగులూరు : సి.పి.ఐ సీనియర్ నాయకులు గొల్లపూడి వెంకటేశ్వర్లు ను ఆ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య గురువారం పరామర్శించారు.ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామం లోని గొల్లపూడి స్వగృహానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు.
ఆరోగ్యం జాగర్త అని,డాక్టర్ సలహాలు తప్పక పాటించాలని కోరారు.
ఈ సందర్భంగా పంగులూరు మండలం లో పార్టీ పరిస్తితి గురించి అడిగి తెలుసు కున్నారు. మెరుగైన వైద్యం కోసం మంచి హాస్పిటల్ లో చూపించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు సింగరకొండ , దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాది సుబ్బారావు, బాపట్ల జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు జేబీ శ్రీధర్ , ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులు పరుచూరి నాగేంద్ర సిపిఐ సీనియర్ నాయకులు బొడావుల వీరాంజనేయులు , సిపిఐ నాయకులు ఇజ్రాయిల్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img