Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సారూ ..స్తంభాన్ని తొలగించరూ

విశాలాంధ్ర – అర్ధవీడు : మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి వెంట పాతిన 11 కెవి విద్యుత్ స్తంభాలు రైతుల వ్యవసాయ కార్యక్రమాలకు ఆటంకంగా నిలిచాయి. వీటిని వ్యాసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిచ్చే ఎల్ టి తీగల మధ్యలో పాతారు. ఈ కారణంగా విద్యుత్ సరఫరా అయ్యే క్రమంలో షార్ట్ సర్కూట్ అయ్యి ప్రమాదం సంభవించే అవకాశం లేక పోలేదు. ముందస్తూ జాగ్రత్తలో భాగంగా సరఫరా నిలిపేశారు. ప్రత్యామ్నాయం చూపలేదు. దీనితో వారి నారు పోయాలనుకునే రైతులకు నిలిచినా విద్యుత్ సరఫరా ఆటంకంగా మారింది. అధికారులు గాని , కాట్రాక్టరు గాని పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img