Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండు బైకులు ఢీ : ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – మార్టూరు : మార్టూరులోనే చైతన్య హై స్కూల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ప్రమాదవశాత్తు ఢీ కొన్న సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని రాజుగారి పాలెం గ్రామానికి చెందిన మురహరి లక్ష్మయ్య (62) మార్టూరు నుండి చిలకలూరిపేట వైపు వెళ్తుండగా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన సతీష్ చిలకలూరిపేట నుండి మార్టూరు వైపు వస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా ,సతీష్ కు తీవ్ర గాయాలైనవి. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వారిని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img