Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ముగ్గురు గల్లంతు ఒకరు మృతి

విశాలాంధ్ర`చీరాల : వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో సముద్ర స్నానానికి వచ్చిన విద్యార్థులలో నలుగురు విద్యార్థులు గల్లంతవ్వగా ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది, గుంటూరు జల్లా బుడంపాడు జివిఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్దులు గురువారం వేటపాలెం రామాపురం బీచ్‌కి విహార యాత్రకు వచ్చారు. సముద్రంలోకి స్నానానికి వెళ్లిన విద్యార్థులలో నలుగురు గల్లంతవ్వగా వారిలో ఒక విద్యార్థి మృతదేహం బయటకు కోటుకువచ్చింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని, డిఎస్‌పి పి శ్రీకాంత్‌, వేటపాలెం ఎస్‌ఐ సురేష్‌, ఇపురుపాలెం ఎస్‌ఐ జనార్దన్‌తో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img