ముంబై : కోచ్గా రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్నప్పటికీ ఒక్క దాంట్లో కూడా చాంపియన్గా నిలవలేకపోయింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అయితే కనీసం సెమీ ఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయింది. అయితే, ద్వైపాక్షిక సిరీస్ల్లో గొప్పగా రాణిస్తోన్న టీమిండియా.. ఐసీసీ టోర్నీలో మాత్రం చతికిలపడుతోంది. కోచ్గా శాస్త్రికి ప్రస్తుత టీ20 ప్రపంచకప్పే చివరిది. ఇకపై అతడిని టీమిండియా కోచ్గా చూడలేం. రవిశాస్త్రి లాంటి గొప్ప కోచ్ నేతృత్వంలో భారత్ ఒక్క ట్రోఫీ కూడా సాధించకపోవడం పెద్దలోటేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అయితే, కోచ్గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఎన్నో మరపురాని విజయాలు సాధించిందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ‘రవిశాస్త్రి నేతృత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. రెండుసార్లు ఆ జట్టును తన సొంత గడ్డపైనే మట్టికరిపించింది. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలో కూడా టీమిండియా గొప్పగా రాణించింది’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.రవిశాస్త్రి నేతృత్వంలో ఒక్క న్యూజిలాండ్లోనే భారత జట్టు ఇప్పటి వరకు పర్యటించలేదు.