Friday, April 26, 2024
Friday, April 26, 2024

నీరజ్‌ చోప్రా, మిథాలీ రాజ్‌కు ఖేల్‌రత్న

న్యూదిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జావెలిన్‌త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా, రజతం గెల్చుకున్న రెజ్లర్‌ రవి దహియాలను ఖేల్‌ రత్నకు సిఫార్సు చేసింది కేంద్రం. మొత్తం 11 మంది అథ్లెట్లను 2021కిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపిక చేసింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బాక్సర్‌ లవ్లీనా బోర్గోహెయిన్‌ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఈ అవార్డు దక్కించుకోనున్న మొదటి ఫుట్‌బాల్‌ ఆటగాడిగా సునిల్‌ ఛెత్రి నిలిచాడు. క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, హాకీ ఆటగాడు పీ శ్రేజేష్‌ కూడా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికవడం విశేషం. పారా అథ్లెట్లకూ..ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు పారాలింపిక్స్‌ జరిగినందున మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు ఎంపికను వాయిదా వేసింది ప్రభుత్వం. షూటర్‌ అవని లేఖరా, మనీష్‌ నర్వాల్‌, జావెలిన్‌ త్రోవర్‌ సుమిత్‌ అంతిల్‌, షట్లర్లు ప్రమోద్‌ భగత్‌, క్రిష్ణా నాగర్‌ టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచారు. వీరందరి పేర్లను ఖేల్‌రత్న అవార్డుకు సెలక్షన్‌ కమిటీ. సిఫార్సు చేసింది.
35 మందికి అర్జున..
కాగా సెలక్షన్‌ కమిటీ 35 మంది అథ్లెట్లను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపించింది. ఇందులో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, పారా టీటీ ప్లేయర్‌ భవీనా పటేల్‌, పారా షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌, హైజంప్‌ అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల పేర్లనూ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img