Friday, April 26, 2024
Friday, April 26, 2024

పుజారాకు మైండ్‌ పోయిందన్న ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది. లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ పుజారాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘పుజారా తన ఆట తీరును పూర్తిగా మరిచిపోయాడు. సముద్రంలో మునిగిన నావలా అన్న చందంగా పుజారా పరిస్థితి తయారైంది. అతనికి మైండ్‌ పోవడంతో పాటు తన మార్క్‌ టెక్నిక్‌ షాట్లను మరిచిపోయాడు. ఆటలో స్కోరు నమోదు చేయడం కంటే మ్యాచ్‌లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ ఒత్తిడిలో కూరుకుపోయి అతను తేలిగ్గా వికెట్‌ ఇచ్చేస్తున్నాడు’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img