నాగపూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం తాము ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రచించలేదని, ఒక్కో బౌలర్ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయని టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న నాగ్పూర్లో భారత్ఆస్ట్రేలియా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ జట్లు నెట్ ప్రాక్టీస్తో తీరిక లేకుండా ఉన్నాయి. కీలక ఆటగాళ్లను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడాడు. టెస్టుకు ఒక విధంగా, వన్డే మ్యాచ్కు మరోవిధంగా ఆడాలి అనుకోలేదు... ఒక్కో బౌలర్ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయన రాహుల్ తెలిపాడు. అయితే పరిస్థితులను బట్టి కొన్ని షాట్లు ఆడాల్సి రావొచ్చునన్నాడు. మేము పరిస్థితులకు అలవాటు పడతామని చెప్పాడు. భారత పిచ్లపై స్పిన్నర్లకు టర్న్ ఎంతలా లభిస్తుందో చెప్పలేమని, అందుకని నెట్ ప్రాక్టీస్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టామని రాహుల్ వెల్లడిరచాడు. అంతేకాదు.. ‘ఆసీస్ బ్యాటింగ్ లైనప్లో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. కుడి చేతివాటం, ఎడమ చేతివాటం బ్యాటర్ల జోడీ బౌలర్లను ఇబ్బంది పెడతారు. అయితే.. అశ్విన్, సిరాజ్, జడేజా వాళ్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాహుల్ అన్నాడు. గతంలో బోర్డర్
గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. 2017లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో రాహుల్ అర్థ సెంచరీతో జట్టును గెలిపించాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో రాహుల్ అర్ధ సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్నాడు. దాంతో, భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.