Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పార్లమెంటు నియోజకవర్గాల సదస్సును జయప్రదం చేయండి… సి రెడ్డి భూదప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఈనెల 20న ధర్మవరంలో జరుగు ఎంఆర్పిఎస్ హిందూపురం అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాల సదస్సు పట్టణంలోని సీఎన్బి ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నరేంద్రబాబు, ఎంఎస్పి సీనియర్ నాయకులు సిరెడ్డి భూదేపా తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాలతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున హిందూపూర్, అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img