Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

నేను ఎటువంటి ప్రచారంలోనూ పాల్గొనలేదు..

ట్రెజరీ ఉద్యోగి పెనుబోలు శంకర్ నారాయణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎమ్మార్వో కాంప్లెక్స్ ఆవరణంలో సోమవారం నాడు ఉమ్మడి అభ్యర్థి అజయ్ కుమార్ యాదవ్ అందరిని గౌరవపూర్వకంగా కలిసి వెళ్లిపోయారని, తాను ఏ పార్టీ ప్రచారంలో కూడా పాల్గొనలేదని ట్రెజరీ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ పెనుబోలు శంకరనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఓ పత్రికలో తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం బాధాకరమని తెలిపారు. ఎన్జీవో హోం నందు గత ఏడు సంవత్సరాలుగా వాకింగ్ చేసుకుని వ్యాయాయం చేస్తూ సెటిల్ ఆడుతున్నానని, నాతో పాటు కొంతమంది ఉద్యోగస్తులు, ఆటగాళ్లు కూడా ఇదే పద్ధతిని దినచర్యగా పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బిజెపి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అనే వారు మైదానంలో ఉన్న అందరిని సాధారణంగా మాట్లాడటం మాత్రమే జరిగింది, అటు తర్వాత వారి వెళ్లిపోయారు. అనంతరం మా క్రీడలైన షటిల్ ని ఆడుకొని తన ఇంటికి పోవడం జరిగిందని వారు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను ప్రచురించి నన్ను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా నా పరిధి దాటకుండా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని వారు తెలిపారు. అంతేకాకుండా తాను మా ట్రెజరీ సంఘం ఏపీటీఎస్ఎ నందు రాష్ట్ర సహాధ్యక్షుడుగా సేవలు కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. అందువలన ఎంతో బాధ్యతతో ప్రభుత్వ నియమ నిబంధనలను లోబడి వ్యవహరించడం నా కర్తవ్యం అని వారు స్పష్టం చేశారు. పట్టణములో ఉన్న స్పోర్ట్స్ క్రీడాకారులకు అందరికీ ఈ విషయం తెలిసిన విషయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img