Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోమొదటి సారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పరిశీలించారు.  వేదిక నిర్మాణం, పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వి.ఐ.పిలు, అధికారులు, సాధారణ ప్రజానీకం కూర్చునే ప్రదేశాలు, ప్రదర్శన శాలలు, శకటాలు తదితర అంశాలను పరిశీలించారు. డిఎస్పి సుభాష్ పెరేడ్ కమాండర్ గా పెరేడ్ ప్రాక్టీస్ చేశారు. 
ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టరు. ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణనీటి సరఫరావిభాగం ఇఇ ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లావిద్యాశాఖఅధికారి బ్రహ్మాజీరావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విజయ గౌరీ, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img