Friday, April 26, 2024
Friday, April 26, 2024

అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఓట్లును నమోదు చేసుకోండి


సోమవారంతో ముగియనున్న గడువు: ఎమ్మెల్యే అలజంగి జోగారావు

విశాలాంధ్ర సీతానగరం: మండలంలోని అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదును త్వరితగతిన చేసుకోవాలని ఎమ్మెల్యే జోగారావు పిలుపునిచ్చారు.శనివారం   మండలంలోని జగ్గునాయుడుపేట, రంగమ్మపేట, వెంకటపురం, బూర్జ  గ్రామాల సచివాలయాలలో   మండలంఅధికారులు, ప్రజాప్రతినిధులతో, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తో కలిపి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి సోమవారం లోగా శతశాతం ఓట్లనమోదును పూర్తి చేయాలని బిఎల్ఓలకు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లుకు దిశానిర్దేశం చేశారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు  ఎంపీపీ బలగ రవనమ్మ,జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు శ్రీరాములునాయుడు, ఆయాగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు పార్వతీపురంలో విజయోత్సవసభ:
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, రాష్ట్రముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి నేటికి (ఆదివారంనాటికీ నవంబర్ 6,2022) ఐదేళ్లుగడిచిన సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలోని గూడ్స్ షెడ్ రోడ్డులోగల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10గంటలకు విజయోత్సవసభ శాసనసభ్యులు అలజింగి. జోగారావు ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మండలపార్టీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు తెలిపారు. ఈకార్యక్రమంలో నియోజక వర్గంలోని నాయకులతోపాటు మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,అభిమానులు, కార్య కర్తలు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img