Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు బడ్డ విఆర్వో

విశాలాంద్ర-కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఒక వితంతువు మహిళ నుండి 15 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా బుధవారం పొన్నుటూ రు గ్రామ విఆర్వో సోమేశ్వరరావు ఎసిబి అధికారులు కు పట్టుబడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి. పొన్ను తుర్ గ్రామానికి చెందిన బేవర శ్రీదేవి భర్త క్రిష్ణా రావు నాలుగేళ్ళ క్రితం మృతి చెందారు తన భర్త పేరు మీద ఉన్నభూమలను తన పేరు మీద బదిలీ చెయ్యాలని శ్రీదేవి మ్యుటేషన్ కి దరఖాస్తు చేసుకుంది. ఎప్పటి నుండో రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగింది చివరకు ఈ పనిచేయడానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని విఆర్వో డిమాండ్ చేసారు. అంతఇచ్చుకోలేను అని రైతు శ్రీదేవి చెప్పగా రూ. 15 వేల రూపాయలు కు డీల్ కుదిరుంది. ఈ లోగా పలుసార్లుతిరిగి విసిగిన శ్రీదేవీ ఎసిబి అధికారులు ను ఆశ్రయించారు. దింతో పొన్నుటూ రు సచివాలయానికొచ్చి నేరుగా విఆర్వో సోమేశ్వర రావు కు 15 వేలు రూపాయలు ఇస్తుండగా మటువేసిన ఎసిబి అధికారులు డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రెడ్ హ్యేండ్ డ్ గా లంచం తీసుకున్న విఆర్వో ను పట్టుకున్నారు. నిందితుడిని విశాఖపట్నం ఎసిబి కోర్టు లో హాజరు పరచనున్నట్లు డిఎస్పీ రమణమూర్తి మీడియా కు తెలిపారు. ఈ దాడు ల్లో సీఐ భాస్కర్ రావు, హరి లు. ఎస్ ఐ లు సత్యారావు ,చిన్నం నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img