Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

లారీ ఢీకొని మహిళ మృతి, ఒకరికి గాయాలు

విశాలాంధ్ర – కొమరాడ/బెలగాం : లారీ ఢీకొని మహిళ మృతి చెందగా వ్యక్తికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంకు చెందిన పిల్లా విశ్వనాథం స్నేహితురాలు బొమ్మాలి జ్యోతి (29) తో కలసి తన స్నేహితుడి పెద్దకర్మ నిమిత్తం కొమరాడ మండలం దుగ్గి గ్రామానికి వచ్చి తిరిగి మోటార్ సైకిల్ పై విశాఖపట్నం వెళ్తుండగా అర్తాం రైల్వే గేటు సమీపంలో వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈసంఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. విశ్వనాధంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు విశ్వనాధంను పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేశారు. కొమరాడ మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి మార్చ్యురీకి తరలించారు. కొమరాడ పోలీసు స్టేషన్ ఎస్ఐ జగదీష్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img