డా.బి.ఆర్ అంబేద్కర్ ్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.