తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్లో సిలబస్ మార్పు చేశారు. ఈ మేరకు కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్తో ఇంగ్లీష్ పుస్తకాలను ముద్రించామని చెప్పారు. ఈ కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ తెలిపారు.