Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇది ట్రైలర్‌ మాత్రమే… : మంత్రి తలసాని

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెరాస నేతలు ధర్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనాల్సిందేనని డిమాండు చేస్తూ అన్ని మండల, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నగరంలోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనాల్సింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. ఇది ట్రైలర్‌ మాత్రమే బీజేపీకి ఇక సినిమా చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలుతుందని అన్నారు. . బీజేపీ నేతలు ధర్నా చేయడానికి కనీసం జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. అలాగే ధర్నాచౌక్‌ను తాము ఎత్తి వేయలేదని స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌ వల్ల ఇబ్బంది అవుతుందని స్థానికులే కోరారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img