Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈ నెల 8న జరిగే సీఎం సభను విజయవంతంచేయాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి


ఈ నెల 8న సీఎం కేసీఆర్‌ వనపర్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి మెడికల్‌ కళాశాల సమీపంలో జరిగే బహిరంగ సభ సభాస్థలి, జిల్లా పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి అధికారులు, నేతలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం సభకు ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన వనపర్తి చేరిందన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి. రైతుల కష్టాలు తెలిసినందునే వ్యవసాయ అనుకూల విధానాలు అవలంబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img