ఎయిడ్స్ మరణాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎయిడ్స్ రోగులకు త్వరలో ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎయిడ్స్ డే సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి కాదని, వ్యాధి నివారణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడటం తగదన్నారు