Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్‌ఒల పరిస్థితి దుర్భరంగా..


సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వీఆర్‌ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని, గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్‌ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు.వీఆర్‌ఒల కు పే స్కేల్‌ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్నారు. వీఆర్‌ఒలకు తక్షణం పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.అలాగే అర్హులైన వీఆర్‌ఒలకు పదోన్నతులు కల్పించాలన్నారు. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img