: మంత్రి కేటీఆర్
టెక్నాలజీ ఆధారిత పాలనకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రెండో ఐటీ పాలసీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతర మంత్రి మాట్లాడుతూ,ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని..ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని అన్నారు. డ్రైవింగ్ లెసెన్స్ టెస్ట్ కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.తెలంగాణలో తలసరి ఆదాయం ఏడేండ్లలో దాదాపు రెట్టింపయిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికంటే ఐటీ ఎగుమతులు రెండిరతలు అయ్యాయని వెల్లడిరచారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి చెప్పారు.