హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ గేట్ వే పేరుతో ఈ ఐటీ పార్కును నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఈ ఐటీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చించనునన్నది.