Friday, May 3, 2024
Friday, May 3, 2024

కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలోని గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బంది గమనించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.మృతులను రామాయంపేట్‌కు చెందిన పద్మ, సంతోష్‌(35)గా పోలీసులు గుర్తించారు. తల్లి వైద్యం కోసం ఈ నెల 11న లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఘటనాస్థలిని డీఎస్పీ సోమనాథం, సీఐ నరేశ్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంతోషను భూములు అమ్మే విషయంలో తమకు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు కొందరు పోలీసు అధికారితో కలిసి డిమాండు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు ప్రజాప్రతినిధులు సంతోష్‌పై కక్ష కట్టారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. తల్లీకుమారుడు ఆత్మహత్యకు ముందు వీడియో చిత్రీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img