Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్‌ మృతికి కారణం : బండిసంజయ్‌

ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే సాయిగణేష్‌పై పీడీయాక్ట్‌ పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లనే చనిపోయాడని బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్‌ బండి సంజయ్‌ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టే అతనిపై పీడీయాక్ట్‌ పెట్టారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 16 కేసులు పెట్టిందని అన్నారు. బీజేపీ కార్యకర్త కాబట్టే సాయిగణేష్‌పై పీడీ యాక్ట్‌ పెట్టారని అన్నారు.అవినీతి మంత్రి పువ్వాడను సాయి గణేష్‌ ప్రశ్నించాడు. అందుకే అతడిపై కేసులు నమోదయ్యాయని అన్నారు.మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్‌ మృతికి కారణమని బండి సంజయ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img