కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉండటంపై ఏపీ సర్కారు అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రాజెక్టుల పరిశీలన బృందంలో కే శ్రీనివాస్ ఉన్నారు. గతంలో కే శ్రీనివాస్పై తాము అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలను ఆపాదించడం అనైతికం అని ఈఎన్సీ పేర్కొన్నది.