: ఆర్టీసీ జేఏసీ
ఈ నెలకు సంబంధించిన జీతాలు చెల్లించకుంటే సమ్మెబాట పడతామని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఆర్టిసి జేఏసీ) ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) సునీల్ శర్మకు ఒక లేఖ రాసింది. ఈ నెల జీతాలను రేపటి (ఆగస్టు 6) లోపు పంపిణీ చేయాలని లేదా రాష్ట్రవ్యాప్తంగా ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు 7న సమ్మెకు దిగుతామని జేఏసీ ఎండికి రాసిన లేఖలో పేర్కొంది.తమ సమస్యలు పరిష్కరించాలంటూ మెమోరాండం సమర్పించి ఇప్పటికే 25 రోజులు గడిచినప్పటికీ, తమకు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ సదరు లేఖలో స్పష్టం చేసింది.