Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ


సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో ఉన్న లోకల్‌ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆయన లేఖలో..కంటోన్మెంట్‌ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని, గతంలోనూ లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాజాగా లోకల్‌ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్‌ గేట్‌ రోడ్డు, గాఫ్‌ రోడ్‌, వెల్లింగ్టన్‌ రోడ్‌, ఆర్డినెన్స్‌ రోడ్‌ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కొవిడ్‌ కేసుల పేరు చెప్పి మూసివేసిందన్నారు. ఈ మూసివేత లక్షలాది మందికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రోడ్ల మూసివేయకుండ అదేశాలిచ్చి లక్షలాది మంది హైదరాబాద్‌ నగర పౌరులకు ఊరట కల్పించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ని మంత్రి కేటీఆర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img