Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసారిగా పాటించాలి

తెలంగాణ హైకోర్టు
ఓ వైపు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన గురిచేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కరోనా, ఒమిక్రాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు గుర్తించి కంటైన్మెంట్‌ జోన్‌, మైక్రో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు… ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలోఒమైక్రాన్‌ పరిస్థితులపై జనవరి 3లోపు కోర్టుకు సబ్మిట్‌ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img