కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. బుధవారం నాకు కరోనా పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నాతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్లోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి అంటూ రాసుకొచ్చారు.