బెంగాల్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుంది : ఈటల
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ ను ఓడిరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పశ్చిమబెంగాల్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడిరచారని… పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడిరచాలని చెప్పారు.