Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం..బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలిన సిలిండర్

ఒకరు మృతి, మరికొందరికి తీవ్రగాయాలు
బాణా సంచా కాల్చటంతో చోటు చేసుకున్న ఘటన

ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో ఈ సమావేశం నిర్వహించగా.. ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌లకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చారు. ఈ సమయంలో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న పూరిగుడిసెపై పడ్డాయి. దీంతో ఇంటికి నిప్పు అంటుకోవటంతో పాటు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img