హైదరాబాద్ నగరంలోని జూపార్కులో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూపార్కులో జంతువుల రక్షణ కోసం అభివృద్ధి పనులు, సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. హైదరాబాద్ జూ పార్క్కు ఐఎస్ఓ14001 మార్క్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 4 వైల్డ్ డాగ్స్, సఫారీ జోన్లో ఏసీ బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర దేశాల పక్షులు ఎన్నో రకాలు ఉన్నాయన్నారు. జూ లోని పక్షులను చూడడానికి అన్ని రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారని తెలిపారు.