డ్రగ్స్, గంజాయి నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలో గంజాయి, మాదకద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే పబ్లను మూసివేస్తామని బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎక్సైజ్ శాఖ అధికారులు, పబ్ల యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమై పబ్లలో డ్రగ్స్, ఇతర అంశాలతో పాటు నిబంధనలపై చర్చించారు.ప్రతి పబ్లో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉండాలని మంత్రి ఆదేశించారు. పబ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే అబ్కారీ శాఖ అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. నిజాయితీగా వ్యవహరిస్తేనే పబ్లకు అనుమతిస్తామన్నారు. పబ్లు, బార్లపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. నగరంలోని 61 పబ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. డ్రగ్స్, గంజాయిని డెలివరీ చేయొద్దని ఈ-కామర్స్ సంస్థలకు మంత్రి సూచించారు.డ్రగ్స్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని సీఎం ఆదేశించారని తెలిపారు. అందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలకు ఆదేశించారని మంత్రి చెప్పారు.