Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణకు స్వచ్ఛ అవార్డులు.. ఎర్రబెల్లి హర్షం

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ కృషి, కెసిఆర్‌ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌లో లభించిన 9 అవార్డులకు తోడు రాష్ట్రాల క్యాటగిరీ, సఫాయి మిత్ర సురక్ష, గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగాల్లో మరో 3 అవార్డులు దక్కాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో భాగంగా రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణను ఎంపికచేశారని, ఇదే విభాగం కింద మూడు లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న పట్టణాల్లో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంపికైందని అన్నారు. కేసీఆర్‌ కిట్లు వంటి అనేక పథకాలు విజయవంతంగా అమలవుతూ, దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆయా పథకాలను కేంద్రం, పలు రాష్ట్రాలు యధాతథంగా అమలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img