తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత హార్థిక శుభాకాంక్షలు తెలిపారు 001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారన్నారు.చిన్న రాష్ట్రాల ఆవిర్భావం అనే అంశం, దేశ రాజకీయాలు, జాతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్న సమయంలో, తన రాజకీయ చతురతను ప్రదర్శించి , దేశంలోని వివిధ పార్టీల మద్దతు కూడగట్టి , మొదటిసారిగా తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండా లో చేర్చి , రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి , వివిధ పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించి, అంతిమంగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగ బద్ధంగా , శాంతియుతంగా, దేశ భౌగోళిక చిత్రపటాన్ని మారుస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో టీిఆర్ఎస్ పాత్ర అద్వితీయం అని అన్నారు.