Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘దళితబంధు’కు రూ.500 కోట్లు విడుదల

దళిత బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం 500 కోట్లు సోమవారం విడుదల చేసింది. హుజురాబాద్‌లో దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు కోసం ఈ నిధులు కేటాయించారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేశారు. హుజూరాబాద్‌లో దాదాపు 15 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. మొదటి విడత కింద 500 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్‌ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్‌ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాలకు.. ఇలా మొత్తం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img