Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దళితుల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉంటుంది

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
దళితుల అభివృద్ధి కోసం పార్టీ కట్టుబడి ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ పుట్టుక నుంచి.. దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. నాటి రాజ్యంగ రూపకర్త అంబేద్కర్‌ దగ్గర నుంచి నేటి వరకు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని కీలక పదవుల్లో ఉంచినట్టు తెలిపారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్‌ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img