హైదరాబాద్ల గణేష్ నిమజ్జనాలు ముగిశాయి. గ్రేటర్ హైద్రాబాద్లో చెరువులు, జీహెచ్ఎంసీ బేబీ పాండ్స్లో మొత్తం 83,186 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. బేబీ పాండ్స్లో 60 వేల 97 విగ్రహాలను నిమజ్జనం చేయగా… చెరువులలో 23,094 విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనం అనంతరం గ్రేటర్ వ్యాప్తంగా వ్యర్థాల చెత్తను జీహెచ్ఎంసీ తొలగించింది.