Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాగలి చేతబట్టి.. గుంటుక దున్నిన షర్మిల

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా.. మక్తల్‌ నియోజకవర్గం ఊట్కూరు మండలంలో షర్మిల రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కాసేపు నాగలి చేతబట్టి గుంటుక దున్నారు. అనంతరం రైతు కూలీలతో మాట్లాడి.. వారి బాధలు విన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సంక్షేమానికి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కృషి చేస్తుందని భరోసా కల్పించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేసినప్పుడు.. హకీంపేట గ్రామ రైతుల కోరిక మేరకు పొలంలో దిగిన కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img