రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిందన్నారు. నిందితులను 24గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆమె అభినందించారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని తెలిపారు.బాధితురాలికి ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.