ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మేడారం మహాజాతరకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వెళ్తారు. అక్కడ సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ముఖ్యమంత్రి వెంట వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి కూడా రానున్నారు.