హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉంచేందుకు ప్రతిఒక్కరూ ‘‘నేను సైతం’లో భాగస్వామ్యం కావాలని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ‘నేను సైతం’లో భాగంగా గురువారం జాంబాగ్లోని అప్జల్గంజ్, సుల్తాన్ బజార్ పోలీసుస్టేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో 60 సీసీ కెమెరాలను నగర సీపీ అంజనీకుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్లతో కలసి ప్రారంభించారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఉపయోగంపడడంతో పాటు నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని అన్నారు. కొత్త సంవత్సర వేడుకలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు జరుపుకోవాలని సూచించారు. వేడుకలో యువత మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.