పార్టీశ్రేణులకు కేటీఆర్ పిలుపు
సెప్టెంబరు 2న జరిగే పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పిటీసిలు, ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్టీ సర్పంచులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గ్రామలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. అదే రోజు దిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సియం కేసీఆర్ చేస్తున్న శంకుస్థాపనకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి కృషి చేయాలన్నారు.