Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బాలిక హత్య కేసులో దోషులపై కఠినచర్యలు : సునీతా లక్ష్మారెడ్డి

వికారాబాద్‌ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కమిషన్‌ కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు కమిషన్‌ కార్యాలయం సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ సహకారంతో నిందితులను గుర్తించి శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దుండగుల బారీ నుంచి రక్షించబడాలంటే బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులు పాటించి ప్రాథమిక రక్షణ పొందాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img