Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీజేపీని ఓడించేందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాం: సీపీఎం కార్యదర్శి తమ్మినేని

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. మోదీని గతింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసేలా బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. దానికి వ్యవసాయ చట్టాలే నిదర్శనం అన్నారు. వాటిని రద్దు చేయాలని బలమైన పోరాటం సాగడంతోనే కేంద్రం వెనకకు తగ్గిందన్నారు. కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, ఇది ఎంతో ప్రమాదకరమన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని స్పష్టంచేశారు. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img