టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు.తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అఫీషియల్గా ప్రకటించారు.ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం రోజులుగా కలిసిన వారందరూ.. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు.. నేను క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు’’.. అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.