న్యూఇయర్ వేడుకలపై ప్రభుత్వ ఆంక్షలపై తెలంగాణ హైకోర్టులో బుధవారం పిల్ దాఖలైంది.హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రశ్నించింది.ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణలో ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ తెలిపారు. ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఒమిక్రాన్ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ విషయంపై రేపు హై కోర్టు మరోసారి విచారించనుంది.