Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలకు గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాయదుర్గం జీRజ కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి డీజీపీ అంజనీ కుమార్ హాజరు కాగా.. సీపీ స్టీఫెన్ రవీంద్ర, ంషంష సెక్రటరీ కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img